బండరాళ్ల లోడుతో వెళుతున్న లారీలు సీజ్
ABN , First Publish Date - 2023-02-23T00:43:59+05:30 IST
కాకినాడ జిల్లా శంఖవరం, రౌతులపూడి మండలాల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా బండరాళ్లతో వెళ్తున్న ఆరు లారీలను సీజ్ చేసినట్టు అన్నవరం ఎస్ఐ శోభన్కుమార్ తెలిపారు.
అన్నవరం, ఫిబ్రవరి 22: కాకినాడ జిల్లా శంఖవరం, రౌతులపూడి మండలాల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా బండరాళ్లతో వెళ్తున్న ఆరు లారీలను సీజ్ చేసినట్టు అన్నవరం ఎస్ఐ శోభన్కుమార్ తెలిపారు. ఈనెల 19న ఆంధ్రజ్యోతిలో మళ్లీ జారిపడిన బండరాళ్లు శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాఽథ్ బాబు స్పందించి ఆదేశాలు జారీచేయడంతో బుధవారం ప్రత్తిపాడు సీఐ కిశోర్బాబు, అన్నవరం ఎస్ఐ.. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి సెంటర్లో 16 లారీలను పట్టుకున్నారు. వీటిలో బండరాళ్లతో వెళ్తున్న ఆరు లారీలను సీజ్ చేయగా జాగ్రత్తలు తీసుకోకుండా నల్ల కంకరను రవాణా చేస్తున్న మరో 10 లారీలకు జరిమానా విధించినట్టు ఎస్ఐ తెలిపారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతరాయంగా జరుగుతాయని హెచ్చరికలు జారీచేశారు.