‘రైల్వే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’

ABN , First Publish Date - 2023-03-19T02:10:04+05:30 IST

2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో రాష్ట్రంలోని అన్ని రైల్వే ప్రాజెక్టులకు జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.150కోట్లు మాత్రమే కేటాయించడంపై కోనసీమ జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు ఆవేదన వ్యక్తంచేశారు.

‘రైల్వే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’

అమలాపురం టౌన్‌, మార్చి 18: 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో రాష్ట్రంలోని అన్ని రైల్వే ప్రాజెక్టులకు జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.150కోట్లు మాత్రమే కేటాయించడంపై కోనసీమ జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు ఆవేదన వ్యక్తంచేశారు. గతంతో పోలిస్తే రూ.50కోట్లు కేటాయింపు లు తగ్గించారని విమర్శించారు.కోనసీమ రైల్వే ప్రాజెక్టు నిర్మా ణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో అన్నివర్గాల వారితో కలసి అఖిల పక్షాన్ని ఏర్పాటుచేసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు.

Updated Date - 2023-03-19T02:10:04+05:30 IST