పులస చిక్కింది

ABN , First Publish Date - 2023-07-18T00:01:37+05:30 IST

యానాం గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో స్థానిక మత్స్యకారుల వలకు పులస చేప ఒకటి చిక్కింది. మూడు కిలోలున్న పులసను సోమవారం వారు యానాం గోదావరి మార్కెట్‌కు తీసుకువచ్చారు.

పులస చిక్కింది

యానాం, జూలై 17: యానాం గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో స్థానిక మత్స్యకారుల వలకు పులస చేప ఒకటి చిక్కింది. మూడు కిలోలున్న పులసను సోమవారం వారు యానాం గోదావరి మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఈ చేపను తల్లి కూతుళ్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి రూ.13 వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు. భీమవరానికి చెందిన వ్యక్తి ఈ పులసను రూ.15 వేలకు కొనుగోలు చేశాడు.

Updated Date - 2023-07-18T00:01:37+05:30 IST