తండ్రి ఫిర్యాదుతో కొడుకులపై కేసు
ABN , First Publish Date - 2023-03-26T01:33:49+05:30 IST
ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారని విశ్రాంత సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పి.గన్నవరానికి చెందిన విశ్రాంత సీఐ దొంగ రామసత్యనారాయణమూర్తి భార్య మంగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.
పి.గన్నవరం, మార్చి 25: ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారని విశ్రాంత సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పి.గన్నవరానికి చెందిన విశ్రాంత సీఐ దొంగ రామసత్యనారాయణమూర్తి భార్య మంగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆస్తి విషయమై తండ్రి, కొడుకుల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఈనెల24న రాత్రి సత్యనారాయణమూర్తి నిద్రిస్తున్న సమయంలో కుమారులు నిలాద్రిఫాణి, సుమఫాణిలు తలుపులు బద్దలుకొట్టి ఆస్తి పత్రాలు ఇవ్వాలని కోరారు. అయితే తండ్రి పత్రాలు ఇవ్వకపోవడంతో కుమారులు గదిలో ఉన్న విలువైన పత్రాలు, పుస్తకాలు, ఫొటోలు బయటకు తీసుకువచ్చి తగలబెట్టారు. ఆస్తి తమ పేరున రాసిఇవ్వకపోతే చంపేస్తామని కొడుకులు బెదిరించినట్లు విశ్రాంత సీఐ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ మురళీమోహనకృష్ణ తెలిపారు.