సీఎంగా జగన్ మళ్లీ అవసరమా?
ABN , First Publish Date - 2023-11-10T23:37:41+05:30 IST
ప్రత్తిపాడు, నవంబరు 10: రాష్ట్రంలో అభివృద్ధి కానరాక ప్రాజెక్టులు, పరిశ్రమలు యువతకు ఉపాధి కరువై రాజధాని లేక రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని ఈ క్రమ ంలో సీఎంగా జగన్ మళ్లీ అవసరమా అంటూ ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల సత్యప్రభ రాజా నిలదీశారు. శు క్రవారం తోట వీధిలోని పార్టీ కా
ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి సత్యప్రభ
ప్రత్తిపాడు, నవంబరు 10: రాష్ట్రంలో అభివృద్ధి కానరాక ప్రాజెక్టులు, పరిశ్రమలు యువతకు ఉపాధి కరువై రాజధాని లేక రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని ఈ క్రమ ంలో సీఎంగా జగన్ మళ్లీ అవసరమా అంటూ ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వరుపుల సత్యప్రభ రాజా నిలదీశారు. శు క్రవారం తోట వీధిలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ 55 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అభివృద్ధిని 3 దశాబ్దాలు వెనక్కి నెట్టిన ఘ నత జగన్కే దక్కుతుందన్నారు. నాయకులు కొమ్ముల కన్నబాబు, బద్ది రామారావు, సూది బూరయ్య, బొదిరెడ్డి గోపాలకృష్ణ, వెన్నా శివ, డాక్టర్ లక్ష్మినారాయణ, యాళ్ళ విశ్వేశ్వరరావు, మంతెన శ్రీను, సూర్నీడి సురేష్, బస్వాప్రసాద్, యా ళ్ళ జగదీష్, కీర్తి సుభాష్, బొల్లు కొండబాబు, రొంగల సత్యనారాయణ పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన జర్నలిస్టు నందుబాబు మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు.
‘విసుగుచెందిన ప్రజలు’
రౌతులపూడి: ప్రజలు జగన్ పాలనపై విసుగుచెం దారని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎప్పుడు పోతుందోని ఎదురుచూస్తూన్నారని ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జి వ రుపుల సత్యప్రభ అన్నారు. బంగారయ్యపేటలో బాబు ష్యూరిటీ ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికి వెళ్లి కర పత్రాలు అందజేసారు. ఉండ్రాజు దివాణం, టీడీపీ మండ లాధ్యక్షుడు తమరాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఇటంశేట్టి సూర్యభాస్కరరావు, పసగడుగుల రమణ, పైల సాంబశివరావు, కుర్రాదొరబాబు తదితరులు పాల్గొన్నారు.