గిరిజనాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

ABN , First Publish Date - 2023-01-17T23:42:19+05:30 IST

గిరిజనాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజా చెప్పారు. నియోజకవర్గలోని సబ్‌ప్లాన్‌ ఏ జెన్సీకి చెందిన పెదమల్లాపురం, వేలంకి, భవురువాక, గిరిజన గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు మంగళవారం ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయానికి తరలివచ్చారు. వైసీపీ ప్రభుత్వం తమగోడును పట్టించుకోవడం లేదని, గిరిజన సమస్యల పరిష్కారానికి కన్నెత్తి చూడడంలేదని

గిరిజనాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
ప్రత్తిపాడులో మాట్లాడుతున్న రాజా

ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజా

ప్రత్తిపాడు, జనవరి 17: గిరిజనాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజా చెప్పారు. నియోజకవర్గలోని సబ్‌ప్లాన్‌ ఏ జెన్సీకి చెందిన పెదమల్లాపురం, వేలంకి, భవురువాక, గిరిజన గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు మంగళవారం ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయానికి తరలివచ్చారు. వైసీపీ ప్రభుత్వం తమగోడును పట్టించుకోవడం లేదని, గిరిజన సమస్యల పరిష్కారానికి కన్నెత్తి చూడడంలేదని నిరసన వ్యక్తం చేశారు. వరుపుల రాజాకు వారం తా మద్దతు తెలిపి గిరిజన గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఎకరువుపెట్టారు. సాగునీరు, విద్య, వైద్యం రహదారి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు. ముఖ్య ంగా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం, పాలకులు తమ గోడును వినడం లేదని వాపోయారు. రాజా మాట్లాడుతూ ప్రసు ్తతం గిరిజనులకు తాగునీరు, రహదారి సౌకర్యాలతో పాటు అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సమస్యల కోసం టీడీపీ ఉధృతంగా పోరాటాలు చేపట్టనుందని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చెటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:42:22+05:30 IST