పోలీసుల అదుపులో మాలమహానాడు నాయకులు

ABN , First Publish Date - 2023-03-31T01:24:01+05:30 IST

మాలమహానాడు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలోని జాతరలో నడిపల్లి రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌ తదితరులు రాజమహేంద్రవరం చేరుకున్నారు.

పోలీసుల అదుపులో మాలమహానాడు నాయకులు

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), మార్చి 30: మాలమహానాడు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలోని జాతరలో నడిపల్లి రాము అనే వ్యక్తిని హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌ తదితరులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఓ హోటల్‌లో బస చేసిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని టూటౌన్‌ స్టేషన్‌కి తరలించారు. అనంతరం మల్లెల వెంకట్రావు, గొల్ల అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని పరార్శించడనాకి వచ్చిన తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తునిలో దాడిశెట్టి రాజా గెలుపునకు దళితులు ఓట్లు భిక్షగా వేస్తే.. ఆయన తన అనుచరులతో రామును కిరాతకంగా హత్య చేయించారని మండిపడ్డారు. జాతరలో రాము కాలు తగిలిందని చంపేయడం ఎంత వరకూ మానవత్వమని ప్రశ్నించారు. రాజా ప్రధాన అనుచరుడు సురేశ్‌, కానిస్టేబుల్‌ మురళీ ఈ హత్యకు కారణమని ఆరోపించారు.

Updated Date - 2023-03-31T01:24:01+05:30 IST