హెచ్‌ఎమ్‌పై పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-03-31T00:15:58+05:30 IST

రూరల్‌ మండలం కొవ్వాడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.సుగంధిపై కోటిపల్లి అంబిక ఆమె భర్త వెంకటసతీ్‌షకుమార్‌ ఇంద్రపాలెం పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మా అమ్మాయి కోటిపల్లి భువన విద్యశ్రీ ఆ పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. ప్రధానోపాధ్యాయిని ఏకారణం లేకుండా 3నెలల నుంచి మా అమ్మాయిని టార్గెట్‌చేస్తూ మానసికంగా హింసిస్తోం

హెచ్‌ఎమ్‌పై పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు

కాకినాడ రూరల్‌, మార్చి 30: రూరల్‌ మండలం కొవ్వాడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.సుగంధిపై కోటిపల్లి అంబిక ఆమె భర్త వెంకటసతీ్‌షకుమార్‌ ఇంద్రపాలెం పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మా అమ్మాయి కోటిపల్లి భువన విద్యశ్రీ ఆ పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. ప్రధానోపాధ్యాయిని ఏకారణం లేకుండా 3నెలల నుంచి మా అమ్మాయిని టార్గెట్‌చేస్తూ మానసికంగా హింసిస్తోంది. 2 రోజు ల క్రితం పాఠశాల అసెంబ్లీలో 400 మంది విద్యార్థుల సమక్షం లో మా అమ్మాయిని అసభ్యపదజాలంతో దుర్భాషలాడుతూ అవమానపరిచడంతో ఆత్మహత్యాప్రయత్నంచేసుకునేందుకు ప్రయత్నించింది. దీనిపై బుధవారం మేము పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎంని అడుగగా ఆమె మాపై దాడిచేసి జాకెట్‌ను చింపివేసింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని కేకలువేసింది. విచారణచేపట్టి మాకు తగిన న్యా యంచేయాలి’’అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇంద్రపా లెం ఎస్‌ఐ నాగరాజుని వివరణ కోరగా హెచ్‌ఎంపై ఫిర్యాదు అం దిందని విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-03-31T00:15:58+05:30 IST