బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2023-05-01T00:43:42+05:30 IST
పిఠాపురం, ఏప్రిల్ 30: బొండాలు రకం ధా న్యం రైతుల వద్దనే ఉండిపోయిందని, తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఆదివారం పిఠాపురం మండలంలోని కోలంకలో ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1010 రకం ధాన్యాన్ని రైస్మిల్లర్లు తీసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, ఏప్రిల్ 30: బొండాలు రకం ధా న్యం రైతుల వద్దనే ఉండిపోయిందని, తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఆదివారం పిఠాపురం మండలంలోని కోలంకలో ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1010 రకం ధాన్యాన్ని రైస్మిల్లర్లు తీసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు దళారులకు అమ్ముకోవంతో చాలా నష్టపోతున్న ట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరాకలు మాత్రమే తీసుకోవడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటి వరకూ సరైన దృష్టి సారించకపోవడం చూస్తే వ్యవసాయం చేసే రైతులను అవస్థలకు గురి చేయడమేనన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కూడా తొలి నుంచి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఏలేరు రైతాంగానికి సాగునీటి ఎద్దడి వస్తుంటే 3టీఎంసీలు తాండవాకు అమ్ముకుంటున్నారన్నారు. ఏదేమైనా టీడీపీ హయంలోనే రైతు లు అన్నిరకాలుగా మేలు జరుగుతుందని వర్మ అన్నారు. టీడీపీ నాయకులు సకుమళ్ల గంగాధర్, ఎలుబండి రాజారావు, వానిశెట్టి వెంకటరమణ, తోట ఉదయ్భాస్కర్, కల్కి మూర్తి పాల్గొన్నారు.