సైకో జగన్ను ఓటుతో తరిమికొట్టాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:19 AM
గొల్లప్రోలు, డిసెంబరు 22: అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సైకో జగన్ను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఎస్సీ కాలనీలో శుక్రవారం అంబేడ్కర్ యూత్, ఖండవిల్లి మణికంఠ మిత్రబృందం సభ్యులు టీడీపీలో చేరగా వారందరికి వర్మ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
గొల్లప్రోలు, డిసెంబరు 22: అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సైకో జగన్ను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఎస్సీ కాలనీలో శుక్రవారం అంబేడ్కర్ యూత్, ఖండవిల్లి మణికంఠ మిత్రబృందం సభ్యులు టీడీపీలో చేరగా వారందరికి వర్మ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ సైకో పాలనకు విసిగిపోయి, చంద్రబాబు ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలు, నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో ఆకరితులై తెలుగుదేశంలో చేరారన్నారు. రాష్ట్రమంతా ఇప్పుడు హలో ఏపీ, బైబై జగన్, వైసీపీ నినాదాలతో మార్మోగుతుందన్నారు. జగన్లాంటి ముఖ్యమంత్రి అవసరం లేదని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, ఓరుగంటి వీరబాబు, దూళ్ల లచ్చబాబు, గుడాల సింహాచలం, నూతాటి ప్రకాష్, బత్తుల శ్రీను, కొల్లు బాబూరావు, పెనుగొండ లక్ష్మీపతి ఉన్నారు.