టీడీపీతోనే ప్రజలకు సంతోషం

ABN , First Publish Date - 2023-06-01T00:17:48+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, మే 31: అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా వడం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పట్ల హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం చంద్రబాబు చిత్రపటానికి వర్మ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. వర్మ మాట్లాడుతూ మహిళలు

టీడీపీతోనే ప్రజలకు సంతోషం
చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న వర్మ

రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, మే 31: అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా వడం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పట్ల హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం చంద్రబాబు చిత్రపటానికి వర్మ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. వర్మ మాట్లాడుతూ మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి చంద్రబా బు ప్రకటించిన వరాలు భవిష్యత్తుపై అందరికి ఒక భరోసా కల్పిస్తాయన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. టీడీపీ మం డలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, మడికి సన్యాసిరా వు, మల్లిపూడి వీరబాబు, తూము బాబు, దూళ్ల లచ్చబాబు, ఓరుగంటి వీరబాబు, పెనుగొండ లక్ష్మీపతి తదితరులున్నారు.

Updated Date - 2023-06-01T00:17:48+05:30 IST