‘సుద్దగడ్డ ఆధునికీకరణను విస్మరించిన ప్రభుత్వం’
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:46 AM
గొల్లప్రోలు, డిసెంబరు 23: సుద్దగడ్డ ఆధునికీకరణను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలంలోని ఏపీ మల్లవరంలో శనివారం జరిగిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నా
గొల్లప్రోలు, డిసెంబరు 23: సుద్దగడ్డ ఆధునికీకరణను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలంలోని ఏపీ మల్లవరంలో శనివారం జరిగిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే రైతులు సమస్యలు గాలికొదిలేశారని, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారన్నారు. మల్లవరంలోని రిజర్వాయర్ పనులు అటకెక్కించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.