కార్మికులకు బకాయిల చెల్లింపు ఆనందకరం
ABN , First Publish Date - 2023-05-27T00:12:04+05:30 IST
పిఠాపురం, మే 26: దశాబ్దాలుగా పోరాడుతున్న కార్మికులకు బకాయిలు చెల్లించడం ఆనందంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్సఎన్ వర్మ తెలిపారు. పిఠాపురంలో రెండు దశాబ్దాల క్రితం మూతపడిన కిర్లంపూడి షుగర్మిల్స్ కార్మికులకు రావాల్సిన గ్యాట్యుటీ, పీఎఫ్ తదితర బకాయిలను చెల్లించేందుకు సిద్దార్థ ఇన్ఫ్రాటెక్ కంపెనీ ముందుకొచ్చింది. శుక్రవారం మిల్లు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఫ్యాక్టరీ కార్మికులకు వర్మ బకాయిల చెక్కులను అందజేశారు. ఆయన మా ట్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, మే 26: దశాబ్దాలుగా పోరాడుతున్న కార్మికులకు బకాయిలు చెల్లించడం ఆనందంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్సఎన్ వర్మ తెలిపారు. పిఠాపురంలో రెండు దశాబ్దాల క్రితం మూతపడిన కిర్లంపూడి షుగర్మిల్స్ కార్మికులకు రావాల్సిన గ్యాట్యుటీ, పీఎఫ్ తదితర బకాయిలను చెల్లించేందుకు సిద్దార్థ ఇన్ఫ్రాటెక్ కంపెనీ ముందుకొచ్చింది. శుక్రవారం మిల్లు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఫ్యాక్టరీ కార్మికులకు వర్మ బకాయిల చెక్కులను అందజేశారు. ఆయన మా ట్లాడుతూ 422మంది కార్మికులకు రావాల్సిన రూ.10కోట్ల బకాయిలను చెల్లించేందుకు సిద్దార్థ ఇన్ఫ్రా ముందుకురావడం అభినందనీయమన్నా రు. కార్మికులు చేస్తున్న పోరాటానికి దశాబ్దంగా తాను అన్ని విధాల మద్దతు తెలిపానన్నారు. కా ర్మికుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడు అధిక ప్రా ధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం సిద్దార్థ ఇన్ఫ్రాటెక్ చైర్మన్ చలమలశెట్టి సునీల్ రూ. 10కోట్ల చెక్కును కార్మిక సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు వ ర్మ, సునీల్లను వేర్వేరుగా సత్కరించారు. కార్మిక సంఘాల ప్రతినిధులు మూర్తి, రాజు మాట్లాడు తూ తమకు రావాల్సిన బకాయిలు కోసం 2013 నుంచి చేస్తున్న పోరాటానికి వర్మ అండగా నిలిచారన్నారు. వర్మకు, బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చిన సునీల్కు కృతజ్ఞతలు తెలిపారు.