పెద్దాపురంలో చోరీ

ABN , First Publish Date - 2023-03-26T00:21:08+05:30 IST

పెద్దాపురం ఫీడర్స్‌ వీధిలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. సీఐ ఎస్‌కే అబ్దుల్‌ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. లలితా ఇండస్ట్రీస్‌ అధినేతలు మట్టే సోదరులకు చెందిన ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలిపారు.

పెద్దాపురంలో చోరీ

పెద్దాపురం, మార్చి 25 : పెద్దాపురం ఫీడర్స్‌ వీధిలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. సీఐ ఎస్‌కే అబ్దుల్‌ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. లలితా ఇండస్ట్రీస్‌ అధినేతలు మట్టే సోదరులకు చెందిన ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలిపారు. ఇటీవల ఇంటి మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో దుండగులు ఇంటి వెనుక భాగం నుంచి ప్రవేశించి చోరీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు రూ.3.75లక్షల నగదు, ఒక బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలిపారు. చోరీ సొత్తు విలువ రూ.నాలుగు లక్షల వరకూ ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-03-26T00:21:08+05:30 IST