జీతాలు చెల్లించండి

ABN , First Publish Date - 2023-03-26T01:08:32+05:30 IST

తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఫారిన్‌ డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది నిరసన ఆందోళన నిర్వహించారు.

జీతాలు చెల్లించండి

  • ప్రభుత్వ సమగ్రాసుపత్రి వైద్య సిబ్బంది నిరసన

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 25: తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఫారిన్‌ డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది నిరసన ఆందోళన నిర్వహించారు. ఈమేరకు శనివారం ఆసుపత్రి ప్రధాన భవనం ఎదుట కొద్దిసేపు నిరసన చేపట్టారు. రెండు నెలల నుంచి జీతాలు రాకపోతే ఎలా బతకాలంటూ వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే రెండు నెలల జీతాలు రావాల్సి ఉందని, మరో వారం రోజులు గడిస్తే మూడు నెలలు పూర్తవుతాయని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని, ఇది చాలా అన్యాయమని వాపోయారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ ఆందోళనలో నర్సింగ్‌స్టాఫ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:08:32+05:30 IST