నేడు, రేపు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు

ABN , First Publish Date - 2023-06-26T00:25:13+05:30 IST

తొండంగి, జూన్‌ 25: అన్ని పాఠశాలల్లో ఈనెల 26,27న తల్లిదండ్రుల సమావేశా లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినందున జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరపాలని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి చామంతి నాగేశ్వరరావు తెలిపారు. తొండంగిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ముందురోజు విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశ వివరాలతో కూడిన లిఖిత పూర్వక ఆహ్వానాలను అందించాలన్నారు. సమావేశానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమా

నేడు, రేపు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు

ఏఎంఓ చామంతి నాగేశ్వరరావు

తొండంగి, జూన్‌ 25: అన్ని పాఠశాలల్లో ఈనెల 26,27న తల్లిదండ్రుల సమావేశా లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినందున జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరపాలని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి చామంతి నాగేశ్వరరావు తెలిపారు. తొండంగిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ముందురోజు విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశ వివరాలతో కూడిన లిఖిత పూర్వక ఆహ్వానాలను అందించాలన్నారు. సమావేశానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశం జరిపే తేదీని ప్రధానోపాధ్యాయులు ముందుగా ఎంఈవో కార్యాలయానికి తెలపాలన్నారు. అఽధికారులు కూడా పరిశీలకులుగా హాజరవుతారన్నారు. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సీఎం సందేశాన్ని సభ్యులకు వినిపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా సమావేశా లు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-06-26T00:25:13+05:30 IST