పారా లీగల్ వలంటీర్లు పేదవారికి న్యాయ సహాయం అందించాలి
ABN , First Publish Date - 2023-06-26T23:54:44+05:30 IST
పారా లీగల్ వలంటీర్లు గ్రా మాలకు వెళ్లి పేదవారికి లభించే న్యాయ సహాయం గురించి వారికి వివరించి చైతన్యవంతులను చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కె.మాధవీదేవి అన్నారు
సీనియర్ సివిల్ జడ్జి మాధవీదేవి
రామచంద్రపురం, జూన్ 26 : పారా లీగల్ వలంటీర్లు గ్రా మాలకు వెళ్లి పేదవారికి లభించే న్యాయ సహాయం గురించి వారికి వివరించి చైతన్యవంతులను చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కె.మాధవీదేవి అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగ ణంలో గత రెండు రోజులుగా జరిగిన శిక్షణా శిబిరం ము గింపు సభలో ఆమె మాట్లాడుతూ వలంటీర్లు అందరూ న్యా యసూత్రాలు నేర్చుకుంటూ గ్రామాలలో న్యాయవేదికలు ఏర్పాటుచేసి ప్రజలను చైతన్య వంతులుగా తీర్చిదిద్దాలన్నా రు. ప్రతినెలా కోర్టులో అందించే శిక్షణలో వలంటీర్లు పా ల్గొనాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ, కార్యదర్శి వాడ్రేవు సాయిప్ర సాద్, సీనియర్ న్యాయవాదులు దొమ్మలపాటి సత్యన్నారా యణ, కె.జానకి, సి.హెచ్.శ్రీనివాస్, దుళ్ళ సత్యన్నారాయణ, పిల్లా పృధ్వీ, పారావలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.