పంచాయతీల ఆదాయం పెంపునకు కృషి
ABN , First Publish Date - 2023-06-03T01:08:32+05:30 IST
ఏజెన్సీలో పంచాయతీలలో ఆదాయం పెంపునకు కృషి చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎన్వి రాఘవన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఏడు మండలాల విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ ఇంటిపన్నులు, బకాయిలు వసూళ్లు, పారిశుధ్య కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
డీఎల్పీవో జీఎల్ఎన్వి రాఘవన్
రంపచోడవరం, జూన్ 2: ఏజెన్సీలో పంచాయతీలలో ఆదాయం పెంపునకు కృషి చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎన్వి రాఘవన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఏడు మండలాల విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ ఇంటిపన్నులు, బకాయిలు వసూళ్లు, పారిశుధ్య కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.