పాదగయలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూజలు

ABN , First Publish Date - 2023-03-31T01:26:29+05:30 IST

కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌ గురువారంరాత్రి సందర్శించారు.

పాదగయలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూజలు

పిఠాపురం, మార్చి 30: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌ గురువారంరాత్రి సందర్శించారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవి, పుర్హుతికా అమ్మవార్లను సతీసమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేదపండితులు క్షేత్రప్రాశస్త్యాన్ని వివరించి ఆశ్వీరచనాలు పలికారు. సుప్రీంకోర్డు జడ్జి దంపతులను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఆగంటి ప్రభాకరరావు, ఈవో వడ్డి శ్రీనివాసరావులు ఆలయ మర్యాదలతో సత్కరించి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-03-31T01:26:29+05:30 IST