జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2023-02-02T02:05:33+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘసమావేశాన్ని కంతేటి నాగవెంకటసుధీర్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు.
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 1: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘసమావేశాన్ని కంతేటి నాగవెంకటసుధీర్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవ టం యానాదయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాపవరపు శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బైలపూడి రామకృష్ణ అనేక అంశాలపై చర్చించారు. వారి సమక్షంలో రాష్ట్ర నాయకులు ర్యాలి పట్టాభిరామయ్య, రామేశ్వరపు శ్రీనివాసరావు, చిట్టాబత్తుల నాగబాబు, శిలారపు సత్తిబాబు ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కాగితా పల్లి నరసింహారావు, అధ్యక్షుడిగా ర్యాలి లోవరాజు, ఉపాధ్యక్షులుగా పసుపు లేటి రామకృష్ణ, కోడూరి శ్రీనివాస్, ప్రఽధాన కార్యదర్శిగా కంతేటి నాగవెంకట సుధీర్, కోశాధికారిగా ముచ్చుపల్లి వీరవెంకటకనకదుర్గారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మాచవరపు సూరిబాబులను ఎన్నుకున్నారు.