రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-03-31T00:16:44+05:30 IST
బెండపూడి శివారు పెట్రోల్ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగన రోడ్డు ప్రమాదంలో గొల్లప్రోలుకు చెందిన జల్లుగంపల వెంక
తొండంగి, మార్చి 30: బెండపూడి శివారు పెట్రోల్ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగన రోడ్డు ప్రమాదంలో గొల్లప్రోలుకు చెందిన జల్లుగంపల వెంకట్రావు(42) మృతి చెందినట్టు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. వెంకట్రావు తుని నుంచి గొల్లప్రోలు వెళ్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయని, 108లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.