బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-03-26T00:19:59+05:30 IST

జగ్గంపేట శివారు కాకినాడ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు.

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒకరి మృతి

జగ్గంపేట, మార్చి 25: జగ్గంపేట శివారు కాకినాడ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన బర్రె మాణిక్యంతో కలిసి బూరుగుపూడి నుంచి కాట్రావులపల్లి బంఽధువుల ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న మద్దిరాల శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, బర్రె మాణిక్యం కాలుకు గాయమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. బర్రె మాణిక్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-26T00:19:59+05:30 IST