మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2023-05-29T00:34:33+05:30 IST

కాకినాడ సిటీ, మే 28: దివంగత ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు, టీడీపీ మహానాడు బహిరంగ సభకు ఆదివారం కాకినాడ నగరం నుంచి 45 బస్సులు, 100 కార్లు, బైక్‌లతో భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాజమహేంద్రవరం వేమగిరికి తరలివెళ్లారు. కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వన

మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు
కాకినాడలో ర్యాలీని ప్రారంభిస్తున్న కొండబాబు

కాకినాడ సిటీ, మే 28: దివంగత ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు, టీడీపీ మహానాడు బహిరంగ సభకు ఆదివారం కాకినాడ నగరం నుంచి 45 బస్సులు, 100 కార్లు, బైక్‌లతో భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాజమహేంద్రవరం వేమగిరికి తరలివెళ్లారు. కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జగన్నాథపురంలోని తన నివాసం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, గ్రంథి బాజ్జి, అంబటి చిన్న, మల్లాడి గంగాధరం, అంబటి చిన్న, చింతలపూడి రవి, నల్లూరి శ్రీనివాస్‌, ఎస్‌కె రహీమ్‌, ఎరిపిల్లి రాము, చోడిపిల్లి సతీష్‌, మూగు రాజు, బంగారు సత్యనారాయణ, అమన్‌జైన్‌, మల్లాడి చిన్న, చింతా పేర్రాజు, జొన్నాడ వెంకటరమణ, మమతా శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2023-05-29T00:34:33+05:30 IST