జేఎన్టీయూకేలో జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌

ABN , First Publish Date - 2023-03-26T01:50:09+05:30 IST

జేఎన్టీయూకేలో సీఈ, సీఎస్‌ఈ, పీఈ, పీసీఈ విభాగాలు డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ సహకారంతో జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌ను శనివారం నిర్వహించారు.

జేఎన్టీయూకేలో జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌

జేఎన్టీయూకే, మార్చి 25: జేఎన్టీయూకేలో సీఈ, సీఎస్‌ఈ, పీఈ, పీసీఈ విభాగాలు డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ సహకారంతో జాతీయస్థాయి సింపోజియం టెక్‌ఫెస్ట్‌ను శనివారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో రెక్టార్‌ కేవీరమణ ముఖ్యఅతిఽథిగా పాల్గొనగా రిజిస్ట్రార్‌ సుమలత, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రెక్టార్‌ మాట్లాడుతూ వినూత్న ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు టెక్‌ఫెస్ట్‌ లు వేదికలుగా నిలుస్తాయన్నారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ విద్యార్థులు తాము నేర్చుకున్న సాంకేతిక అంశాలను తోటి విద్యార్థులతో పంచుకోవాలన్నారు. టెక్‌ఫె స్ట్‌లో విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, ప్రాజెక్టులు, టెక్నికల్‌ క్విజ్‌లు నిర్వహించారు. విభాగాధిపతులు, అధ్యాపకులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:50:09+05:30 IST