Share News

జగనాసుర పాలన త్వరలో పతనం

ABN , First Publish Date - 2023-10-30T00:14:57+05:30 IST

కక్ష సాధింపు రాజకీయాలు, తప్పుడు కేసులతో నాయకులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు.

 జగనాసుర పాలన త్వరలో పతనం

రావులపాలెం, అక్టోబరు 29: కక్ష సాధింపు రాజకీయాలు, తప్పుడు కేసులతో నాయకులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి రావులపాలెంలోని టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేప ట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అందరూ సంఘీ భావం తెలిపాలని సత్యానందరావు కోరారు. నాయకులు చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామా రావు, కోనాల అంబేడ్కర్‌, జక్కంపూడి వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:14:57+05:30 IST