వైభవంగా స్వామివారి చక్రస్నానం

ABN , First Publish Date - 2023-06-03T01:32:06+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాల్లో భాగంగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా స్వామివారి చక్రస్నానం

మామిడికుదురు, జూన్‌ 2: అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణోత్సవాల్లో భాగంగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యార్చన, సహస్ర నామార్చన, నిత్య హోమం, బలిహరణ, చతుష్టానార్చనలు, వేద పారాయణం, హోమం మంగళ శాసనం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహి ంచా రు. అనంతరం స్వామివారిని మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ చక్రస్నానానికి తోడ్కొని వెళ్లారు. అనంతరం వైనతే య నదిలో స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్‌ డి.శ్రీరామప్రసాదరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, అర్చకస్వాముల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేకే అకాడమీ రాజోలువారిచే సాంస్కృ తిక నృత్య ప్రదర్శనలు, భీమవరంనకు చెందిన నాగమణి హరికథా కాలక్షేపం భక్తుల మనసులను రంజింప చేశాయి. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని చక్రస్నానం ఆచరించారు.

Updated Date - 2023-06-03T01:32:06+05:30 IST