రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2023-03-31T00:52:37+05:30 IST
జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గంజాయి లారీని రాజానగరం- నరేంద్ర పురం జంక్షన్ వద్ద పోలీసులు గురువా రం రాత్రి పట్టుకు న్నారు.
రాజానగరం, మార్చి 30 : జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గంజాయి లారీని రాజానగరం- నరేంద్ర పురం జంక్షన్ వద్ద పోలీసులు గురువా రం రాత్రి పట్టుకు న్నారు.ఏజెన్సీ ప్రాంత మైన నర్సీపట్నం నుంచి గంజా యిని మధురైకు ప్రత్యేకంగా తయారు చేసుకున్న లారీ కేబిన్లో భారీ స్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా రాజాన గరం వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ మేరకు లారీ, 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10 లక్షలకు పైబడి ఉంటుందని అధికారుల సమక్షంలో పోలీసులు ధ్రువీరించారు. ఇందుకు సంబంధించి గంజాయితో పాటుగా లారీని స్వాధీనం చేసుకుని, ఈ కేసు లో ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.