ఘనంగా మొల్లేటి రామస్వామి గజమాల ఊరేగింపు

ABN , First Publish Date - 2023-06-01T01:23:54+05:30 IST

అప్పనపల్లి ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి విగ్రహానికి సమర్పించే గజమాల ఊరే గింపు ఘనంగా జరిగింది.

ఘనంగా మొల్లేటి రామస్వామి గజమాల ఊరేగింపు

మామిడికుదురు, మే 31: అప్పనపల్లి ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి విగ్రహానికి సమర్పించే గజమాల ఊరే గింపు ఘనంగా జరిగింది. రాజోలు తాలూకా శెట్టిబలిజ సం ఘం ఆధ్వర్యంలో తాటిపాక నుంచి అప్పనపల్లి వరకు ఊరే గింపు నిర్వహించారు. ప్రతీ ఏడాది బాలబాలాజీ కల్యాణం రోజున మొల్లేటి రామస్వామి విగ్రహానికి గజమాలను అలంక రిస్తారు. ఈగజమాలకు దారి పొడువునా మహిళలు హార తులు పడతారు. మామిడికుదురు మండల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీనివాస్‌, గుబ్బల శ్రీనివాస్‌, వాసంశెట్టి శంకరరావు, పెచ్చెట్టి సత్యచంద్ర, కడలి నూకరాజు, జోగి రామకృష్ణ, కాండ్రేగుల రాము, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:23:54+05:30 IST