Share News

రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తా

ABN , First Publish Date - 2023-12-03T01:37:55+05:30 IST

రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తా

రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తా

యానాం, డిసెంబరు 2: యానాం ప్రాంతీయ విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ సాధించి రాష్ట్ర స్థాయి(పుదుచ్చేరి)కి వెళ్లే విద్యార్థులకు ఆర్థికంగా సహకారం అందిస్తానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మల్లాడి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. సాయంత్రం స్థానిక చిల్డ్రన్స్‌ అడిటోరియంలో విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్‌ అధ్యక్షతన జరిగిన విద్యావైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మల్లాడి హాజరయ్యారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. సర్వశిక్ష అభియాన్‌ఏడీపీసీ కమిడి ప్రభాకరరావు, దంగేటి త్రిమూర్తులు, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T01:37:58+05:30 IST