Share News

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:35 AM

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మిషన్ల భద్ర తకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఎన్నికల నిర్వహణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

ముమ్మిడివరం, డిసెంబరు 30: ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మిషన్ల భద్ర తకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఎన్నికల నిర్వహణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఎన్నికల సంబంధిత అధికారులతో కలిసి శని వారం తనిఖీ నిర్వహించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధిం చి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా మా ట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గ నిర్దేశాల మేరకు ప్రతీ నెల ఈవీ ఎంలు, వీవీప్యాట్ల గోదామును క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ప్రతీ మూడు నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎలు, వీవీప్యాట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్‌ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, డిప్యూటీ తహశీల్దార్‌ యడ్ల రాంబాబు పాల్గొన్నారు.

తెలిపారు. తిరిగి

Updated Date - Dec 31 , 2023 | 01:35 AM