Share News

ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:29 AM

పిఠాపురం, డిసెంబరు 17: దేశంలోని పంచమాధవ క్షేత్రా ల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో ఉన్న కుంతీమాధవస్వామి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఆదివారం ప్రార ంభమయ్యాయి. వైఖానసాగమోక్త ప్రకారం స్వామి, గోదాఅమ్మవారికి, ఆళ్వార్లకు నెలరోజులు పాటు సేవలు, విశేష త్సవాలు జరగనున్నా

ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం

పిఠాపురం, డిసెంబరు 17: దేశంలోని పంచమాధవ క్షేత్రా ల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో ఉన్న కుంతీమాధవస్వామి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఆదివారం ప్రార ంభమయ్యాయి. వైఖానసాగమోక్త ప్రకారం స్వామి, గోదాఅమ్మవారికి, ఆళ్వార్లకు నెలరోజులు పాటు సేవలు, విశేష త్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామున అభిషేకం, ధనుర్మాసం ప్రారంభం, స్వామి, గోదాఅమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర నామార్చనలు, ద్రవిడ ప్రబంధ పారాయణ,పాశుర విన్నపం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రా త్రి గోదాఅమ్మవారి మాడవీధి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమాల్లో కుంతీమాధవస్వామి ఆలయ ఈవో సీహెచ్‌వీ రమణమూర్తి, ధర్మకర్తలమండలి, భక్త బృందం పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:29 AM