గ్రామాల్లో ప్రసూతి సేవలపై ప్రత్యేక శ్రద్ధ
ABN , First Publish Date - 2023-06-03T01:19:50+05:30 IST
గ్రామాల్లో ప్రసూతి సేవలపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టామని డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వరరావు అన్నారు. రంగంపేట మండలంలోని రంగంపేట, సింగంపేట గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.
డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వరరావు
అనపర్తి, జూన్ 2: గ్రామాల్లో ప్రసూతి సేవలపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టామని డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వరరావు అన్నారు. రంగంపేట మండలంలోని రంగంపేట, సింగంపేట గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రోగులకు అందుతున్న సేవలను, అందుబాటులో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్వో మాట్లా డుతూ సీఎం జగన్ ఆదేశాలతో ప్రతి ఒక్కరికి వైద్య సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైద్యులు లావణ్య, నాగశ్రీవిద్య, సిబ్బంది ఉన్నారు.