చింతలూరుకు పోటెత్తిన భక్త జనం

ABN , First Publish Date - 2023-03-31T00:48:58+05:30 IST

వసంత రాత్రులలో మహార్నవమి (శ్రీరామనవమి) సందర్భంగా చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

 చింతలూరుకు పోటెత్తిన భక్త జనం

ఆలమూరు, మార్చి 30: వసంత రాత్రులలో మహార్నవమి (శ్రీరామనవమి) సందర్భంగా చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లులో వేచి ఉండి అమ్మవారిని దర్శించు కున్నారు. అమ్మవారికి చంటిపిల్లల చేత కాగడాలు, వారపోయుట, తుళ్లిబిళ్ల వంటి మొక్కులు చెల్లించుకుని పూజించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఉండవల్లి వీర్రాజు, ట్రస్టుబోర్డు చైర్మన్‌ నూకపెయ్యి సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-31T00:48:58+05:30 IST