బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కృష్ణ
ABN , First Publish Date - 2023-01-26T01:41:49+05:30 IST
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సాకు
అమలాపురం రూరల్, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సాకుర్రు గ్రామ రెవెన్యూ అధికారిగా, బూత్లెవెల్ అధికారిగా పనిచేస్తున్న అయినాపురపు కృష్ణ రాష్ట్రస్థాయులో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్హరిచందన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిలు ము ఖ్య అతిథులుగా హాజరై కృష్ణను సత్కరించారు.