రత్నగిరి ఈవోగా ఆజాద్‌

ABN , First Publish Date - 2023-03-26T00:19:06+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్‌ ఈవోగా ఎస్‌ఎస్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

రత్నగిరి ఈవోగా ఆజాద్‌

అన్నవరం, మార్చి 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్‌ ఈవోగా ఎస్‌ఎస్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఈవోగా పనిచేస్తున్న సత్యనారాయణమూర్తి తన తల్లి మరణానంతరం సెలవుపై వెళ్లడంతో ఆజాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే. శనివారం రెగ్యులర్‌ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేవస్థానంలో సత్రం గదులు దళారుల చేతికి చిక్కకుండా కేవలం భక్తుడి వేలిముద్రతో సత్రం గది తీసుకోవడం, అదే వేలిముద్రతో ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2023-03-26T00:19:06+05:30 IST