గోవధశాల నిర్వాహకుల అరెస్టు

ABN , First Publish Date - 2023-03-31T00:55:44+05:30 IST

పశువుల కబేళాపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు.

 గోవధశాల నిర్వాహకుల అరెస్టు

రామచంద్రపురం, మార్చి 30: పశువుల కబేళాపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న పాకలో అక్రమంగా ఆవులను వధించి, మాంసాన్ని పట్టణంలో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎస్‌ఐ డి.సురేష్‌బాబు సిబ్బందితో కబేళాపై దాడిచేశారు. ఆరు ఆవులు, ఒక ఎద్దును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను రాజమహేంద్రవరంలో గల బొబ్బిలంక గోశాలకు తరలించామన్నారు. గంధం ఏసుబాబు, బోల ఆశయ్యలను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-31T00:55:44+05:30 IST