‘ఆలమూరు’ను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలి
ABN , First Publish Date - 2023-06-03T01:31:21+05:30 IST
ఆలమూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రతినిఽ దులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణ రావు అన్నారు.
ఆలమూరు, జూన్ 2. ఆలమూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రతినిఽ దులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణ రావు అన్నారు. ఆలమూరు మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో జాన్ లింకన్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి అధికారులు శాఖల వారీగా వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అభి వృద్ధి పనులు వేగవంతం చేయడానికి చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వున్న పలు సమస్యలను ఎంపీ టీసీలు, సర్పంచ్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు తోరాటి సీతామహాలక్ష్మి, తహసీల్దార్ ఐ.పీ.శెట్టి, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.