బస్సు దిగి వెళ్లి మృత్యువుకు చిక్కాడు..
ABN , First Publish Date - 2023-03-31T00:57:22+05:30 IST
మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది.. ముగ్గురి ప్రాణాలను బలితీ సుకుంది.
గోకవరం బాలుడి మృతి
జంగారెడ్డిగూడెం, మార్చి 30 : మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది.. ముగ్గురి ప్రాణాలను బలితీ సుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిృష్టారం గ్రామానికి చెందిన నక్కా రవి (30), ఉషా దంపతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఉంటున్న రవి సోదరి అయిన వేల్పుల కళావతి, అనంత కుమార్ దం పతుల ఇంటికి రెండు రోజుల కిందట వచ్చారు. అక్కడ నుంచి గురువారం తిరుగు ప్రయాణం అయ్యారు. రవి, ఉషా దంపతులు ద్విచక్ర వాహనంపై బయలుదేరగా.. అనంతకుమార్, కళావతి దంపతులు వారిద్దరు పిల్లలు జోసఫ్ బెంజ్మెన్ (12), జాయ్బాబులు బస్సులో బయ ల్దేరారు.మార్గమధ్యలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బస్టాండ్కు బస్సు వచ్చేసరికి జోసఫ్ బెంజ్మెన్ తన మేనమామ రవితో కలిసి బైక్పై వెళతానని మారం చేశాడు. ఈ విషయం తెలిసి రవి బస్టాండ్ వద్దకు వచ్చి మేనల్లుడిని ఎక్కించుకుని బయల్దేరాడు. అక్కడ నుంచి 10 నిమిషాలు ప్రయాణం సాగగా జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీ కొనడంతో కిందపడిన రవి, బెం జ్మెన్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. బెంజ్మెన్ గోకవరంలో 6వ తరగతి చదువుతున్నాడు. తీవ్రంగా గాయపడిన ఉషాను 108లో తొలుత జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి అక్కడ నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దేవులపల్లి వద్ద మృతి చెందింది.ప్రమాదానికి కారణమైన లారీ ముందువెళ్తున్న లారీని ఓవర్టేక్ చేస్తూ అతివేగంగా దూసుకొచ్చి బైక్ను ఢీకొ నడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేక రించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృత దేహాలను మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద తల్లి కళావతి ‘నా కుమారుడు జోసఫ్ బెంజ్మెన్ పడుకు న్నాడు..లేపండి..ఆడుకునే సమయమైంది’....అంటూ కన్నీ రుమున్నీరుగా రోదించడం చూపరులను కలచి వేసింది.