Share News

ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

ABN , First Publish Date - 2023-11-24T01:45:58+05:30 IST

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ పీలేరువాసి తన కుమార్తెకు అక్కడి అబ్బాయి నచ్చడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తిరుపతిలో పెళ్లి చేశారు.

ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

పీలేరు ఎన్‌ఆర్‌ఐకి అమెరికా అబ్బాయితో పెళ్లి

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 23: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ పీలేరువాసి తన కుమార్తెకు అక్కడి అబ్బాయి నచ్చడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తిరుపతిలో పెళ్లి చేశారు.అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన జె.విద్యాసాగర్‌ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1990లో అమెరికా వెళ్లారు.తిరుపతికి చెందిన పి.విజయలక్ష్మిని మనువాడి అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె రోషినివైష్ణవి అక్కడే విద్యనభ్యసించి సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన అమెరికా అబ్బాయి కొడిజేమ్స్‌లాయిడ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడంతో ప్రేమ చిగురించింది. ఇరువైపులా పెద్దలు వివాహానికి అంగీకరించారు.తిరుపతిలో గురువారం రాత్రి డీబీఆర్‌ రోడ్డులోని శ్రీకన్వెన్షన్‌ హాల్లో రిసెప్షన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.శుక్రవారం ఉదయం హిందూ సంప్రదాయంలో వివాహం జరగనుంది.వరుడి మత సంప్రదాయం ప్రకారం అమెరికాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి వీరి వివాహం జరగనుంది.

Updated Date - 2023-11-24T01:45:59+05:30 IST