వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.19 కోట్లు

ABN , First Publish Date - 2023-06-01T01:45:14+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.19 కోట్లు

ఐరాల(కాణిపాకం), మే 31: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. బుధ వారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌, ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారు, 1 కేజీ120 గ్రాముల వెండి,535 యూఏఎ్‌సఏ, 15ఆష్ట్రేలియా,33 సింగపూర్‌ డాలర్లు,105 మలేసియా రింగిట్స్‌, 5 ఇంగ్లాండు పౌండ్స్‌ లభించాయి. గో సంరక్షణ హుండీ ద్వారా రూ.6080 లభించినట్లు వారు తెలిపారు. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజులలో లభించినట్లు వారు తెలిపారు. ఈ లెక్కింపులో డీఈవో వెంకటసుబ్బయ్య, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, హరి, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:45:14+05:30 IST