రేపు, ఎల్లుండి ‘జనసేన’ సమావేశాలు
ABN , First Publish Date - 2023-09-22T00:55:10+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు.
తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 21: ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల ఇన్చార్జులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాల నిమిత్తం శనివారం ఉదయం నాగబాబు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రామచంద్రాపురం మార్గంలోని నిశాల్ కన్వెన్షన్కు చేరుకుంటారు. శనివారం తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీనెల్లూరు, చంద్రగిరి, మదనపల్లె నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు. ఆదివారం పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, పీలేరు, తంబళ్లపల్లె, చిత్తూరు నియోజకవర్గాలపై సమీక్ష ఉంటుందని హరిప్రసాద్ వివరించారు.