నేడు రైతుల ఖాతాల్లో రూ.133.48 కోట్లు జమ

ABN , First Publish Date - 2023-06-01T01:49:28+05:30 IST

వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ కింద ఈ సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయంగా రూ.133.48 కోట్లు రైతుల ఖాతాల్లో గురువారం జమ చేయనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

నేడు రైతుల ఖాతాల్లో రూ.133.48 కోట్లు జమ

తిరుపతి(కలెక్టరేట్‌), మే 31 : వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ కింద ఈ సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయంగా రూ.133.48 కోట్లు రైతుల ఖాతాల్లో గురువారం జమ చేయనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 1,76,921మంది రైతులు, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సాగు రైతులకు రూ.7,500 చొప్పున జమ చేయనున్నట్లు వివరించారు. మార్చి 23 నుంచి మే 23వ తేదీ వరకు పడిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు 416మందికి రూ.32.93లక్షలు గురువారం జమవుతాయన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమం తడ మండలం ఎస్‌ఆర్‌ఎం గ్రాండ్‌ ఇయర్‌ కల్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు జరగనుందని తెలిపారు.

Updated Date - 2023-06-01T01:49:28+05:30 IST