ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2023-12-06T00:52:59+05:30 IST
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
చిత్తూరు, డిసెంబరు 5: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఆరు కిలోల గంజాయిని సీజ్ చేసి, నిందితులను రిమాండ్కు తరలించారు. ఒకటో పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి మీడియాకు ఈ వివరాలను మంగళవారం వెల్లడించారు. జడ్పీ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో అనుమానాస్పదంగా ఉన్న వినాయకపురానికి చెందిన రిజ్వాన్, షౌకార్పేటకు చెందిన ఆన్సర్ను పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. వారితో పాటూ జానకారపల్లెకు చెందిన రహంతుల్లా పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు.