మూడవ విడత ఆసరా రూ.300.53 కోట్లు
ABN , First Publish Date - 2023-03-26T02:20:23+05:30 IST
ఆసరా పథకం కింద జిల్లాలోని 33,757 పొదుపు సంఘాల్లో వున్న 3,18,992మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.300.53కోట్లు జమ కానుందని కలెక్టర్ వెంకట్రమణారెడ్డి అన్నారు.
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 25: ఆసరా పథకం కింద జిల్లాలోని 33,757 పొదుపు సంఘాల్లో వున్న 3,18,992మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.300.53కోట్లు జమ కానుందని కలెక్టర్ వెంకట్రమణారెడ్డి అన్నారు. వచ్చే నెల ఐదో తేదీ వరకు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి, ఈ మొత్తాలకు సంబంధించిన చెక్కులు అందజేస్తారని తెలిపారు.సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కమ్యూనిటీ డెవల్పమెంట్(ఎడ్యుకేషన్) చైర్మన్ రామ్కుమార్రెడ్డి, డీఆర్డీఏ పీడీ జ్యోతి, మెప్మా పీడీ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.