వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2023-03-26T01:08:42+05:30 IST
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి శనివారం కాణపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), మార్చి 25: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి శనివారం కాణపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఆమెను ఏఈవో విద్యాసాగర్రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి.. స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.