సబ్ పోస్టుమాస్టర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-09-22T01:12:07+05:30 IST
అవినీతి ఆరోపణలతో చిత్తూరులోని మార్కెట్ బ్రాంచ్ సబ్ పోస్టు మాస్టర్ రాంకుమార్ను సస్పెండ్ చేసినట్లు చిత్తూరు తపాలా డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మన్న గురువారం తెలిపారు.
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 21: అవినీతి ఆరోపణలతో చిత్తూరులోని మార్కెట్ బ్రాంచ్ సబ్ పోస్టు మాస్టర్ రాంకుమార్ను సస్పెండ్ చేసినట్లు చిత్తూరు తపాలా డివిజన్ సూపరింటెండెంట్ లక్ష్మన్న గురువారం తెలిపారు. చిత్తూరు నగరం ఇరువారం సబ్పోస్టు ఆఫీ్సలో పని చేస్తున్న సమయంలో ఖాతాదారుల నగదు మాయం చేసిన ఘటనపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై విచారించగా ఖాతాదారులు చెల్లించిన నగదును అతడు దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సస్పెండ్ చేశామని వివరించారు. అతడి నుంచి రూ.2 లక్షలు రికవరీ చేశామన్నారు. సబ్పోస్టు ఆఫీస్ పరిధిలో పొదుపు పుస్తకాలు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.