పుష్పరథంపై సుబ్రహ్మణ్యుడి కటాక్షం
ABN , First Publish Date - 2023-03-04T00:04:43+05:30 IST
పుత్తూరులో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు పుష్పరథంపై భక్తులను అనుగ్రహించారు.
పుత్తూరు టౌన్, మార్చి 3: పుత్తూరులో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు పుష్పరథంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వా మివారు పుష్పరథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సుందరం పాల్గొన్నారు.