Tirumala : నేడు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల
ABN , First Publish Date - 2023-02-25T07:32:57+05:30 IST
నేడు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల టికెట్లు నేడు విడుదల కానున్నాయి.
తిరుమల : నేడు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల టికెట్లు నేడు విడుదల కానున్నాయి. రోజుకు 500 టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల కానున్నాయి. టికెట్లను పొందాలనుకునే భక్తులు ఆన్లైన్లో 12 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.