‘అమృత్ భారత్ స్టేషన్’కు శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ఎంపిక
ABN , First Publish Date - 2023-06-03T01:45:02+05:30 IST
అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ఎంపికైనట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
రేణిగుంట, జూన్ 2: అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ఎంపికైనట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. అలాగే చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని రైల్వేస్టేషన్లలో చిత్తూరు, పాకాల, మదనపల్లె రోడ్డు, పీలేరు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఈ స్కీమ్ ఉద్దేశమన్నారు. ఇప్పటికే స్టేషన్ల వారీగా ప్రతిపాదనలు తీసుకుని టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారని, దశలవారీగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు.