గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించండి: డీఐవో
ABN , First Publish Date - 2023-07-02T01:43:11+05:30 IST
గర్భిణులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఐవో రవిరాజు సూచించారు.
చిత్తూరు రూరల్, జూలై 1: గర్భిణులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఐవో రవిరాజు సూచించారు. శనివారం డీఎంహెచ్వో కార్యాలయంలో శిశు మరణాలపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి గర్భిణీని 12-16 వారాల్లోపు నమోదు చేసి.. అన్ని పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కాన్పుకు కనీసం మూడేళ్ల కాల వ్యవధి ఉండేలా ఏఎన్ఎంలు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. గైనకాలజిస్టులు పాల్గొన్నారు.